మైలవరం: షాపులో వ్యక్తి మెడలోంచి బంగారు చైన్ చోరీ, ఇద్దరు అరెస్ట్

మైలవరం మండలం అడ్డరోడ్డులో గత నెల 12న నాగేశ్వరరావు(69) అనే వ్యక్తి షాపులో ఉండగా, గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు అతని మెడలోంచి 28 గ్రాముల బంగారు చైన్ ను బలవంతంగా లాక్కెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దొంగతనానికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి మంగళవారం కీర్తిరాయినిగూడెం వద్ద అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ సుధాకర్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్