మైలవరం: బుసక తొలకలు.. ఇంకిపోతున్న నీళ్లు..

మైలవరం మండలం సబ్జపాడులో బుసక బకాసురులు రెచ్చిపోతున్నారు. వాగులో జెసిపిలతో బుసక తోడడం వల్ల వందల ఎకరాల్లో ఉన్న మల్లె పైరులు, కూరగాయలు, మామిడి తోటలకు నీళ్లు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలు ముదరడంతో పైరును కాపాడుకునేందుకు నీళ్లు పెట్టిన నిమిషాల వ్యవధిలోనే వాగు మొత్తం పీల్చుకుంటోందని తెలిపారు. అధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్