మైలవరం శ్రీరాజా SVRGNR జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సామర్థ్యాధారిత పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసే అంశంపై చేసిన పరిశోధన జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో, శనివారం బెంగళూరులో జరిగిన ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ పెడగాజీ ఇన్నోవేటివ్ కాన్ఫరెన్స్ లో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సరికొండ సతీష్ కు CBSE పూర్వ అకడమిక్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం ప్రశంసాపత్రం అందజేశారు.