నందిగామ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు అంతర్గత సమస్యల కారణంగా నిలిచిపోయాయని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదివారం తెలిపారు. ప్రస్తుతం పాక్షిక మరమ్మతులు చేపట్టేందుకు కాంట్రాక్టర్ సతీశ్ ముందుకు రావడంతో పనులు కొనసాగుతున్నాయని ఆమె చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.