మొవ్వ: ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి

సోమవారం సాయంత్రం కూచిపూడి నుండి పామర్రు వెళుతూ మార్గమధ్యంలో అయ్యంకిలో వాహనం ఆపి, శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా రైతులతో మాట్లాడారు. ఆరబెట్టిన, పరజాలు కప్పి ఉంచిన ధాన్యాన్ని పరిశీలించి, కొనుగోలు ప్రక్రియపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్