ప్రతి డ్వాక్రా మహిళ పారిశ్రామిక వేత్తగా ఎదగాలని జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ హరిహరనాథ్ అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో నియోజకవర్గ బ్యాంకర్లు, ఏపీఎంలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డ్వాక్రా సంఘాల్లో ఉన్నతంగా వ్యాపారం నిర్వహిస్తున్న మహిళలను గుర్తించి, వారికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందించాలని ఆయన సూచించారు.