బంటుమిల్లిలో విజయలక్ష్మి కన్వెన్షన్ లో జరిగిన పి4 జీరో పావర్టీ ప్రథమ వార్షికోత్సవం కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ సోమవారం సాయంత్రం పాల్గొన్నారు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న మార్గదర్శకులకు దిశలువతో సత్కరించి ప్రశంసా పత్రాలను అందించారు. పి4 పథకం సాధారణ పథకం కాదని, పేదల బ్రతుకులు మార్చే పథకమని ఆయన అన్నారు. పేద ప్రజలకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు.