దిత్వా తుఫాను ప్రభావంతో వాతావరణం మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం ఉదయం వరకు గంటకు రూ. 4,000 ఉన్న వరి కోత మిషన్ల ధరలను మధ్య దళారులు అమాంతం పెంచారు. రాత్రి సమయంలో కోసేందుకు మిషన్ యజమానులు గంటకు రూ. 5,000 డిమాండ్ చేస్తున్నారు. చేసేది లేక, నష్ట భయం కారణంగా రైతులు ఎక్కువ ధరకే ఒప్పందం కుదుర్చుకుంటున్నారు.