కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెంలో చెరువులో బైకు కట్టి మామ అల్లుళ్లు మృతి చెందిన ఘటనపై పూర్తి విచారణ చేపడుతున్నట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. సోమవారం ఘటన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన, మృతికి గల కారణాలను అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు. ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు.