ఉప్పాల హారికపై జరిగిన దాడిని రాష్ట్ర గౌడ సంఘం తీవ్రంగా మంగళవారం ఖండించింది. సంఘం నాయకులు ఆమె నివాసానికి చేరుకుని సంఘీభావం తెలిపారు. బీసీ మహిళగా హారిక జడ్పీటీసీగా ఎన్నికై జిల్లా ప్రథమ పౌరురాలిగా గుర్తింపు పొందడాన్ని అగ్రకుల నాయకులు ఓర్వలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షుడు యార్లగడ్డ గోవర్ధన్ రావు విమర్శించారు.