కాకర్లమూడి కేంద్రంగా గత కొంతకాలంగా సాగుతున్న అక్రమ ఇసుక రవాణాపై రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. రాత్రి వేళల్లో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో, నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న ఒక ట్రాక్టర్ను రెవెన్యూ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి శుక్రవారం గుర్తించి సీజ్ చేశారు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.