ఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి పెనమలూరు వైసీపీ ఇన్చార్జ్ దేవభక్తుని చక్రవర్తి శుక్రవారం బయల్దేరారు. మచిలీపట్నంలో పాదయాత్రగా వెళ్తున్న వైసీపీ కార్యకర్తలను అడ్డుకునే క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. లాఠి ఛార్జ్ చేయడంతో దేవభక్తుని చక్రవర్తి, వైసీపీ నేతలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు లాఠిచార్జి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.