పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ, నాటక రంగం మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని, యువతలో సృజనాత్మకతను పెంపొందించడంలో నాటక పోటీలు దోహదం చేస్తాయని తెలిపారు. పరుచూరి రఘుబాబు స్మారక 36వ అఖిల భారత నాటక పోటీలు మంగళవారం రెండో రోజు ఘనంగా జరిగాయి. అంతరించిపోతున్న నాటక రంగాన్ని కాపాడుకోవాలని, రఘుబాబు సేవలను స్మరించుకుంటూ ఈ పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు.