గంపలగూడెం మండలంలోని మేడూరు, గంపలగూడెం, గోసవీడు, తునికీపాడు, నెమలి గ్రామాల్లోని శివ, వైష్ణవ ఆలయాల్లో బుధవారం రాత్రి కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని 1116, 365, 108 వత్తులతో కార్తీక దీపాలు వెలిగించి దీపోత్సవ పూజ చేశారు. పెనుగొలను శివాలయంలో కుటుంబ సమేతంగా భక్తులు కార్తీక దీపం వెలిగించారు.