మొంథా తుపాను కారణంగా ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి, వేలాది ఎకరాల్లో చేతికొచ్చిన వరి పంట నేలవాలింది. పత్తి, మిరప తోటలు దెబ్బతిన్నాయి. ఆరబోసిన గింజలు తడిసిపోయాయి. పెట్టుబడి మొత్తం నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. తుపాను ప్రభావం ఎన్టీఆర్ జిల్లాలపై ఎక్కువగా ఉంది.