జిల్లా వ్యాప్తంగా పెడన, ఉయ్యూరు, గుడివాడ, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాల్లో మట్టి మాఫియా ప్రకృతి వనరులను దోచుకుంటోందని ఆరోపణలు వస్తున్నాయి. పెడనలో ట్రాక్టర్ మట్టికి రూ. 250 వసూలు చేస్తున్నారని సమాచారం. శనివారం వీరవల్లిలో అక్రమంగా తరలిస్తున్న మట్టి లారీలను జనసేన నేతలు అడ్డుకోవడంతో ఈ అక్రమ తవ్వకాల వ్యవహారం మరోసారి బహిర్గతమైంది.