మచిలీపట్నం నియోజకవర్గంలో వరి పంటలకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని వైసీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు కోరారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ డీకే బాలాజీని కలిసిన ఆయన సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమయానికి నీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.