ఆదివారం, భవానిపురానికి చెందిన అనిత మాధురి, మధురానగర్కు చెందిన శ్రీనివాస్ తన వద్ద చీటీ వేసి, చీటీ డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడని కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనలాగే మరికొంతమంది బాధితులు ఉన్నారని, శ్రీనివాస్ కనిపించడం లేదని ఆమె పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.