విజయవాడలో దారుణం జరిగింది. కానూరు వరలక్ష్మిపురంలో ఓ ఆగంతకుడు బుధవారం రాత్రి అన్నంలో పురుగుల మందు కలిపి వీధి కుక్కలకు పెట్టాడు. ఫలితంగా ఆ అన్నం తినగానే ఏడుకు కుక్కలు మరణించాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై జంతుప్రేమికులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.