విజయవాడలోని జక్కంపూడి వద్ద ఉన్న జిడ్కో ఇళ్లను 2256 మంది లబ్ధిదారులకు సోమవారం అప్పగించేందుకు అధికారులు చర్యలు పూర్తి చేశారు. నిర్మాణం పూర్తయినప్పటికీ, ప్రభుత్వాలు మారడంతో ఇళ్లు లబ్ధిదారులకు అందలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఇళ్లకు రంగులు వేయించి లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధమైంది. దీంతో లబ్ధిదారుల సొంత ఇంటి కల నెరవేరనుంది.