విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో మంగళవారం జరిగిన ఇఫ్తార్ విందులో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆమె రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో సామరస్యం పెంపొందించడమే ఇఫ్తార్ విందు లక్ష్యమని, అల్లా దయ రాష్ట్రంపై ఎప్పుడూ ఉండాలని ఆమె ఆకాంక్షించారు. మైనారిటీల హక్కుల రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని ఆమె హామీ ఇచ్చారు.