విశాఖ నుంచి నడికుడికి ప్రయాణిస్తున్న దంపతులకు ఏసీ బోగీలో చోటు ఇస్తానని నమ్మించి, విశాఖ ఎక్స్ప్రెస్లో ఏసీ బోగీ అటెండెంట్ అయిన ఒడిశాకు చెందిన శౌరవ్ బగ్ది ఒక వివాహితపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రెంటచింతల పోలీసులు జీరో ఎస్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై విజయవాడ రైల్వే పోలీసులు నిందితుడిని బుధవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.