కృష్ణానదిలో వరద ప్రవాహం మరింత పెరుగుతోంది. బుధవారం సాయంత్రానికి కంకిపాడు మండలంలోని మద్దూరు, కాసరనేనివారిపాలెం వద్ద లంక భూముల్లోకి నీరు చేరింది. పుచ్చలలంక గ్రామం పూర్తిగా నీటమునిగింది. ప్రకాశం బ్యారేజీ నుంచి విడుదల పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు పడవలను ఒడ్డుకు చేర్చి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.