విజయవాడ ధర్నా చౌక్ వద్ద సోమవారం నుంచి నిరసన తెలుపుతున్న అంగన్వాడీల ధర్నాను మంగళవారం తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేశారు. భారీగా తరలివచ్చిన పోలీసులు అంగన్వాడీలను అదుపులోకి తీసుకోవడంతో ధర్నా శిబిరం వద్ద ఉద్రిక్తత నెలకొంది.