విజయవాడ రమేష్ ఆసుపత్రి కూడలిలో బుధవారం సాయంత్రం ట్రాఫిక్ బాగా నిలిచింది. అంతలోనే ఎల్ఈడీ లైట్లు మెరిపించే డ్రోన్ ఆకాశంలో కనిపించి ట్రాఫిక్పై నిఘా పెట్టింది. వెంటనే సైరన్ మోతతో ఒక ద్విచక్రవాహనం వచ్చింది. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు డ్రోన్ల సహాయంతో కొత్త కార్యక్రమం ప్రారంభించారు. 14 డ్రోన్లను డీజీపీ గుప్తా ఇవాళ అధికారులుకి అప్పగించనున్నారు.