చంద్రగ్రహణం కారణంగా, మార్చి 3న విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయాన్ని ఉదయం 10 గంటల నుంచి మూసివేయనున్నారు. దీనితో గిరి ప్రదక్షిణ, ఆర్జిత సేవలు, పంచ హారతులు రద్దు చేయబడ్డాయి. ఆలయ తలుపులు మార్చి 4న (బుధవారం) తెల్లవారుజామున 3 గంటలకు తిరిగి తెరుచుకుంటాయి. సంప్రోక్షణ అనంతరం, ఉదయం 8 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం అందుబాటులో ఉంటుంది. ఉదయం 8.30 గంటలకు ఆర్జిత సేవలు ప్రారంభమవుతాయి.