లిక్కర్ స్కాం కేసులో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం ముడుపులు మళ్లించేందుకు ఏర్పాటు చేసిన షెల్ కంపెనీలను గుర్తించిన సిట్ టీమ్ వాటిని తనిఖీ చేయడానికి ముంబై వెళ్లింది. ఈ కంపెనీలను కూడా లిక్కర్ కేసులో నిందితులుగా చేర్చింది. ఈ కేసులో రూ.11 కోట్ల సీజ్కు సంబంధించిన వివరాలు కావాలని సిట్ను ఈడీ ఇప్పటికే కోరింది. ఇక ఇదే కేసులో ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.