విజయవాడ నగరం 'సూపర్ స్వచ్చ లీగ్' అవార్డుకు ఎంపికైంది. 10 లక్షలకుపైగా జనాభా కలిగిన నగరాల విభాగంలో ఈ గౌరవం దక్కింది. ఈ నెల 17న ఢిల్లీలో అధికారులు, ప్రజాప్రతినిధులు అవార్డు అందుకుంటారు. స్వచ్ఛ భారత్ లీగ్లో విజయవాడకు గుర్తింపు రావడం పారిశుద్ధ్య కార్మికుల కృషికి ఫలమని మేయర్ భాగ్యలక్ష్మీ, కమిషనర్ ధ్యాన్చంద్ర తెలిపారు.