విజయవాడ నగరంలో ప్రజలు ప్రభుత్వ అనుమతులు లేని చిట్ఫండ్ సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ దామోదర్ సూచించారు. అధిక లాభాల ఆశ చూపి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన హెచ్చరించారు. ఏదైనా చిట్ఫండ్లో పెట్టుబడి పెట్టే ముందు, ఆ సంస్థకు ప్రభుత్వ అనుమతులు, చట్టబద్ధమైన నమోదు ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.