చల్లపల్లి మండలం కొత్త మాజేరు గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ సభ్యుడు యార్లగడ్డ సోమయ్య (85) గురువారం వయోభారం, అనారోగ్యంతో కన్నుమూశారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో ప్రారంభించి, విభజన తర్వాత సిపిఎంలో కొనసాగారు. భూసంస్కరణ ఉద్యమాల్లో చండ్ర రాజేశ్వరరావు, బాపనయ్యలతో కలిసి పనిచేశారు. కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్, వార్డు మెంబర్గా సేవలందించారు. నాయకులు ఘన నివాళులు అర్పించారు.