ఆలూరు టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి మంగళవారం మాట్లాడుతూ, మొంథా తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు వంకలు దాటేటప్పుడు రైతులు, పాడుబడ్డ ఇళ్లల్లో నివసించేవారు, చిన్న పిల్లలతో ఉన్న తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ప్రజలకు అవసరమైన సూచనలు అందించాలని కోరారు.