మండల కేంద్రమైన క్రిష్ణగిరిలో బస్టాండ్ సమీపంలో గల వైయస్సార్ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిన్న రాత్రి ధ్వంసం చేశారని, క్రిష్ణగిరి మండల వైసిపి నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.