గురువారం ఆదోనిలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మకు బీజేపీ కౌన్సిలర్లు వినతిపత్రం అందజేశారు. ఆదోని ఎమ్మెల్యే పీవీ పార్థసారథి సమక్షంలో తాము స్వచ్ఛందంగా బీజేపీలో చేరినప్పటికీ, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి అంజనమ్మ తమను అవమానించారని వారు ఆరోపించారు. కూటమి పార్టీల మధ్య గౌరవం, సమన్వయం అవసరమని, ఇలాంటి వ్యాఖ్యలు విభేదాలకు దారితీస్తాయని, అంజనమ్మపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.