ఆదోని మండలంలో ఎరువుల వ్యాపారి వీరేష్ పై రైతులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతు రవి పొలానికి సంబంధించిన మందుల కొనుగోలు లావాదేవీల్లో భేదాభిప్రాయాలు రావడంతో, వీరేష్ తన అనుచరులతో కలిసి రవి 50 క్వింటాళ్ల పత్తితోపాటు ట్రాక్టర్ ను అడ్డగించి ఎత్తుకెళ్లినట్లు బాధితులు ఆరోపించారు. ఎమ్మెల్యే పార్థసారథి అనుచరులే తమను బెదిరించారని రైతులు తెలిపారు.