ఆదోని టీడీపీ కార్యాలయంలో బుధవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ జరిగింది. మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు 40 మంది అర్హులకు రూ. 13,57,590 విలువైన చెక్కులను అందజేశారు. నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించడంలో సీఎం చంద్రబాబు నాయుడు, మీనాక్షి నాయుడు కృషి ఫలితమని ఉమాపతి నాయుడు తెలిపారు.