ఆదోని మండలం పాండవగల్లులో పూజారి వీరాంజనేయులు ఇంట్లో శనివారం రాత్రి దొంగతనం జరిగింది. బాధితుడు ఉపాధి కోసం బెంగళూరు వెళ్లగా, ఆదివారం ఇంటికి వచ్చి చూసేసరికి తలుపులు, బీరువాలు పగలగొట్టి బంగారం అపహరించినట్లు గుర్తించారు. వరుస దొంగతనాలతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు రాత్రిపూట గస్తీ పెంచి, నిందితులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.