ఆదోని జిల్లా ఏర్పాటుకు 109వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. బుధవారం ఆదోనిలో జిల్లా జేఏసీ నేతల ఆధ్వర్యంలో పట్టణ, గ్రామ వార్డులలో కళాజాత, ఆట, పాటల ద్వారా ప్రజలకు జిల్లా ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎమ్మెల్యేలు ఉద్యమంలో భాగస్వామ్యులుగా చేశారు. జిల్లా ప్రకటించే వరకు దీక్ష కొనసాగిస్తామని నాయకులు తెలిపారు. ఆదోని జిల్లా జేఏసీ నాయకులు ప్రత్యక్షంగా వాళ్ళకు కళ్ళకు కట్టినట్లు కళాజాత, ఆట, మాట, పాట ద్వారా అవగాహన కల్పించారు.