ఉయ్యాలవాడ మండలం నర్సిపల్లెలో కుందూ నది ఉద్ధృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గురువారం ఎస్సీ కాలనీలో 10 ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. తక్షణ సహాయం అందించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.