రాజమహేంద్రవరం శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి దేవస్థానంలో నూతన ధ్వజస్తంభ ఊరేగింపు మహోత్సవంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించిందని ఆమె తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.