చాగలమర్రి మండలం గోడిగనూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పోలికల లక్ష్మీరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో, శుక్రవారం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వారి స్వగృహానికి వెళ్లి, మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, టీడీపీ ప్రభుత్వం మరియు భూమా కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.