ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అహోబిలంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా, ఆదివారం దిగువ అహోబిలంలో స్వామివారి కల్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఆమె స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ఆళ్లగడ్డ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఐశ్వర్యాలతో ఉండాలని, ప్రాంతానికి శాంతి, అభివృద్ధి కలగాలని ప్రార్థించారు.