ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని చింతకుంట్ల గ్రామంలో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందించారు. అధికారులతో కలిసి లబ్ధిదారులకు ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పింఛన్లను శుక్రవారం అందజేశారు. సంక్షేమం ప్రతి ఇంటికీ చేరాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఆమె అన్నారు. గ్రామస్థులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.