మాఘ మాస గురువారం నాడు నందవరం చౌడేశ్వరి దేవి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి తెల్లవారుజామున ప్రత్యేక అలంకరణ, ప్రాతఃకాల పూజలు, పసుపు పారాయణంతో సింగారించి, రుద్రాభిషేకం, మహామంగళహారతి ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.