ఈ సదస్సును ఉద్దేశించి కె.ఎస్.లక్ష్మణరావు కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి సభ్యులు మరియు పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్ మాట్లాడుతూ నోటిఫికేషన్లు జూన్ నెల నుంచి వచ్చే అవకాశం ఉందని వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పిందన్నారు.
అభ్యర్థులందరూ నోటిఫికేషన్ రాగానే సిలబస్ మొదట అధ్యయనం చేయాలనీ సూచించారు. ఏకాగ్రతతో పట్టుదలతో టెక్స్ట్ పుస్తకాలను కూడా అధ్యయనం చేయాలని, అలాగే ప్రతి రోజు న్యూస్ పేపర్ బాగా స్టడీ చేయాలని సూచించారు. సబ్జెక్టుల్లో అయితే అవగాహనతో అర్థం చేసుకుంటేనే ఉద్యోగం వస్తాయన్నారు.