దివంగత నేత నాదెండ్ల భాస్కర్ రావు మృతికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హైదరాబాద్లోని వారి నివాసంలో సంతాపం వ్యక్తం చేశారు. సహచర మంత్రులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ తండ్రి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు.