డోన్లో సాఫ్ట్డ్రింక్ బాటిల్లో బొద్దింక కనిపించిన ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. శ్రీనివాసనగర్కు చెందిన ఇంద్ర కిశోర్ స్థానిక దుకాణంలో కొనుగోలు చేసిన థంసప్ బాటిల్ను ఇంటిలో తెరవబోతుండగా అందులో బొద్దింక కనిపించింది. దీంతో వినియోగదారుల హక్కుల ఉల్లంఘనపై ఫోరంలో ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు. నాణ్యత నియంత్రణలో నిర్లక్ష్యం జరిగిందని స్థానికులు ఆరోపిస్తూ, సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.