బేతంచెర్ల మండలం గూటుపల్లె గ్రామంలో శుక్రవారం రూ. 10 లక్షల విలువైన వ్యవసాయ డ్రోన్ను 80% సబ్సిడీతో ప్రభుత్వం అందించింది. వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి డ్రోన్ను ప్రారంభించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి తొలి ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు. వ్యవహార శైలి తెలుసుకొని స్వయంగా ఆపరేట్ చేశారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.