తన పంట అమ్మకంతో వచ్చిన రూ. 3 లక్షలు బ్యాంక్ ఖాతాలో ఉంచగా, ఆ ఖాతా హ్యాక్కు గురై డబ్బులు మాయం అయ్యాయని ఆరోపిస్తూ కర్నూలు జిల్లా తాండ్రపాడు గ్రామానికి చెందిన మహేంద్ర అనే బాధితుడు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ను సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని తన అల్లుడి ఖాతాలో జమ చేసిన డబ్బులు సైబర్ దాడికి గురై మాయం అయ్యాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.