విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రాయిస్ ఫాతిమా మంగళవారం ఒక ప్రకటనలో, గత నెల మార్చి 18న విడుదలైన బ్యాక్లాగ్ ఉద్యోగాల ప్రకటనలో బధిరుల కేటగిరి అర్హతల్లో సవరణలు చేసినట్లు తెలిపారు. ముందుగా 55% కంటే ఎక్కువ వికలత్వం ఉన్నవారు అర్హులని ప్రకటించగా, తాజా సవరణ ప్రకారం రెండు చెవుల్లో 60-70 డెసిబెల్స్ వినికిడి లోపం ఉన్న అభ్యర్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు.