గార్గేయపురం చెరువులో వివాహిత ఆత్మహత్య

కర్నూలు రూరల్ మండలం గార్గేయపురం చెరువులో శనివారం తిరుపతమ్మ (40) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. భూపాల్ నగర్ కు చెందిన ఆమె శ్రీరామనవమి పూజల్లో పాల్గొన్న తర్వాత కనిపించకుండా పోయింది. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్